English | Telugu

ఓటు విలువ చెప్పే ప్రభంజనం

"రంగం", "రచ్చ" సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న అజ్మల్ ప్రస్తుతం "ప్రభంజనం" చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అజ్మల్ మాట్లాడుతూ... ఈ సినిమాలో అల్లరి విద్యార్థిగా, తండ్రిని విసిగించే కొడుకుగా, భాద్యతగల పౌరుడిగా, రాజకీయ నాయకుడిగా కనిపిస్తాను. ఓటు విలువ చెబుతూనే.. అన్ని వాణిజ్య అంశాల్ని మేళవించాం. ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేస్తుంది. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండ నచ్చుతుందని భావిస్తున్నాను" అని అన్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.