English | Telugu

పోటుగాడికి సక్సెస్‌ వస్తుందా...

స్టార్‌ వారసునిగా టాలీవుడ్‌ కి పరిచయం అయిన యంగ్‌ హీరో మంచు మనోజ్‌ కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు నటవారసునిగా చిన్నప్పటినుంచే స్క్రీన్‌ మీద కనిపిస్తున్నా హిట్‌ కొట్టటంలో మాత్రం ఇంత వరకు సక్సెస్‌ కాలేదు.

"బిందాస్‌" లాంటి సినిమాలు అడపాదడపా వచ్చినా స్టార్‌ స్టేటస్‌ అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి ఎలాగైన సక్సెస్‌ కొట్టాలని చేస్తున్న సినిమా పోటుగాడు.

దాదాపుగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న పోటుగాడు ఆగస్టులో రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌. పవన్‌ వడేయార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరగుతున్నాయి.

నలుగురు హీరోయిన్స్‌ నటిస్తున్న ఈ సినిమా రామలక్ష్మీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై లగడపాటి శిరిషా శ్రీదర్‌లు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక పాట మనోజ్‌ పాడగా, మరోపాటను శింబు పాడటం విశేషం.. ఈ రెండు పాటలు సినిమాకే హైలెట్‌ అవుతాయంటున్నారు చిత్రయూనిట్‌. మరి ఈ సినిమా అయిన మనోజ్‌కు ఆశించిన సక్సెస్‌ ఇస్తుందో లేదో తెలియాలంటే మాత్రం రిలీజ్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.