English | Telugu

"పూలరంగడు" వంద రోజులు పూర్తి

"పూలరంగడు" వంద రోజులు పూర్తిచేసుకుంది. ఆర్ ఆర్ మూవీమేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సిక్స్ ప్యాక్ రాయల్ హీరో సునీల్ హీరోగా, ఇషా చావ్లా హీరోయిన్ గా, పనే దైవంగా భావించే "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం"పూలరంగడు". ఈ "పూలరంగడు" చిత్రం ఈ రోజుకి అంటే "మే" 27 వ తేదీకి వందరోజులు పూర్తిచేసుకుంది.

సినిమా విడుదలైన రెండో వారం కూడా దాటకుండానే బాక్సులు వెనక్కు వచ్చేస్తున్న ఈ రోజుల్లో "పూలరంగడు" చిత్రం శతదినోత్సవం జరుపుకోవటం చాలా ప్రశంసనీయం...ముదావహం...హర్షణీయం...! ఈ చిత్ర విజయానికి వీరభద్రం చౌదరి దర్శకత్వ ప్రతిభ, హీరో సునీల్ నటన, డ్యాన్సులు, నిర్మాత అచ్చిరెడ్డి రాజీపడని నిర్మాణపు విలువలు కారణం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.