English | Telugu

"ఆదిత్య 369" సీక్వెల్లో బాలయ్య సరసన అనుష్క

"ఆదిత్య 369" సీక్వెల్లో బాలయ్య సరసన అనుష్క హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో యువరత్ననందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన "ఒక్క మగాడు" చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించింది. కానీ ఆ చిత్రం ఫ్లాపవటంతో మళ్ళీ బాలకృష్ణ సరసన అనుష్క నటించలేదు.

మళ్ళీ ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే "ఆదిత్య 369" చిత్రం సీక్వెల్లో అనుష్క హీరోయిన్ గా నటించనుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. తొంభైలలో వచ్చిన సైంటిఫిక్ హిస్టారికల్ ఫిక్షన్ చిత్రం "ఆదిత్య 369" అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.