English | Telugu

మహేష్ బాబు కారుకి చలానాలు విధించిన పోలీసులు!

-మహేష్ ఫ్యాన్స్ హంగామా
-మహేష్ కారుకి చెలనాలు
-ssmb 29 ఎలా జరగబోతుంది
-ఏం చెప్పబోతున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)అభిమానుల కోలాహలంతో రామోజీ ఫిలింసిటీకి వెళ్లే దారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ssmb 29 సభావేదిక ప్రాంగణమైతే ఇప్పటికే అభిమానులతో నిండి పోయింది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. మరి కాసేపట్లో మహేష్, రాజమౌళి, ప్రియాంక చోప్రా తో పాటుచిత్ర యూనిట్ సభాస్థలికి చేరుకోనుంది. మహేష్, రాజమౌళి తో పాటు మిగతా వాళ్లంతా మూవీ గురించి ఎలాంటి వివరాలని వెల్లడి చేస్తారనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.

also read:కాంత ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్ కొట్టారా!


సోషల్ మీడియా వేదికగా కూడా మహేష్ అభిమానులు హంగామా మాములుగా లేదు.ssmb 29భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్తు వస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకి మహేష్ కారుకి సంబంధించిన చలానా ఒకటి కంటపడింది. హైదరాబాద్(Hyderabad)ట్రాఫిక్ పోలీసులు మహేష్ కారుకి రెండు చెలానాలు విధించారు.సదరు కారు నెంబర్ టిఎస్36ఎన్ 4005 . ఆ రెండు చెలనాలని పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే, పివిఎన్ఆర్ ఫ్లై ఓవర్ పై విధించారు. అక్టోబర్ 4 ,అక్టోబర్ 17 డేట్స్ ఉన్నాయి. మొత్తం అమౌంట్ రెండు వేల డెబ్భై రూపాయలు. ఇప్పుడు ఈ చెలనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.