English | Telugu

మెగా, నందమూరి హీరోల మధ్యలో పాయల్ 'మంగళవారం'!

సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో నటించిన హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా లో నటించిన హీరో అండ్ హీరోయిన్ కాంబినేషన్ లో సినిమా కోసం కుడా ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ దర్శకుడు, హీరోయిన్ కాంబినషన్ కోసం ఎదురుచుడటం చాలా రేర్ గా జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు దర్శకుడు, హీరోయిన్ ల కాంబినేషన్ లో సినిమా చూడటం కోసం సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆ దర్శకుడు హీరోయిన్ ఎవరో కాదు అజయ్ భూపతి అండ్ పాయల్ రాజపుత్.

వాళ్ళిద్దరి కాంబో లో వచ్చిన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తో వాళ్ళిద్దరి కాంబినేషన్ మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆర్ ఎక్స్ 100 లో పాయల్ తన అందచందాలని ఒక రేంజ్ లో ప్రదర్శించింది. ఆ సినిమా ఘన విజయంలో పాయల్ ఒంపు సొంపులతో పాటు అజయ్ భూపతి డైరెక్షన్ కూడా ఒక కారణం. తాజాగా వాళ్ళిద్దరి కలయికలో మంగళవారం అనే సినిమా రాబోతుంది. ఆల్రెడీ మూవీకి సంబంధించిన టీజర్ అండ్ ఒక సాంగ్ రిలీజ్ అయ్యి మంగళవారం సినిమా మీద అంచనాలని పెంచడం తో పాటు ఎప్పుడెప్పుడు మంగళవారం సినిమా చూస్తాము అని ప్రేక్షకులు భావించేలా చేసింది. ఇప్పుడు మంగళవారం సినిమా రిలీజ్ డేట్ ని చిత్రబృందం ప్రకటించింది. నవంబర్ 17న మంగళవారం సినిమా విడుదల కాబోతుంది. ఈ మేరకు డేట్ ని ప్రకటించడంతో పాటు పాయల్ పల్లెటూరి అమ్మాయి గెటప్ లో సీతాకోకచిలుకలతో ఆడుకుంటున్న వాల్ పోస్టర్ ని కూడా చిత్రబృందం రిలీజ్ చేసింది.

కాగా నవంబర్ 10న మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ', నవంబర్ 24న నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమాలు విడుదల కానున్నాయి. మరి ఈ రెండు సినిమాల మధ్యలో నవంబర్ 17న విడుదలవుతున్న 'మంగళవారం' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం అజయ్ భూపతి, పాయల్ ఇద్దరు ప్లాప్స్ లో ఉన్నారు. మంగళవారం సినిమా హిట్ ఇస్తుందని వారు నమ్మకంగా ఉన్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.