English | Telugu

ఓజి లో పవన్ కళ్యాణ్ ని ప్రకాష్ రాజ్ బీట్ చేస్తే.. పరిస్థితి ఏంటి!  

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ఈ నెల 25 న గ్యాంగ్ స్టార్ డ్రామా 'ఓజి'(Og)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. రిలీజ్ డేట్ కి రెండు వారాలే ఉండటంతో పాటు, ప్రచార చిత్రాలు జోరందుకోవడంతో ఫ్యాన్స్ లో పండుగ వాతావరణం వచ్చినట్లయింది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ 'ప్రకాష్ రాజ్' ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటి వరకు, ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలు గురించి చెప్పుకొచ్చారు కానీ,ప్రకాష్ రాజ్ క్యారక్టర్ ఎలా ఉండబోతుందో వెల్లడి చెయ్యలేదు.

ప్రకాష్ రాజ్ (Prakash Raj)నటనకి ఉన్న శక్తీ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. హీరోలని బీట్ చేసే విధంగా తన నటన కొనసాగుతుంది. ఇందుకు బడా క్యారక్టర్ ని పోషించాల్సిన అవసరం లేదు. చిన్న క్యారక్టర్ అయినా సరే, ప్రకాష్ రాజ్ తన నటనతో ఎదుటివారిని బీట్ చేస్తాడు. ఇందుకు ఎన్నో సినిమాల్లోని క్యారెక్టర్స్ ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పవన్, ప్రకాష్ రాజ్ ఇటీవల సనాతన ధర్మం విషయంలో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. ఈ విషయంలో పవన్ కొన్ని సార్లు సైలెంట్ గా ఉన్నా, ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ పై విమర్శలని ఆపలేదు. పైగా పవన్ ఉప ముఖ్యమంతి హోదాలో రాజకీయంగా తీసుకున్న పలు నిర్ణయాలని కూడా ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తు వస్తున్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతు వస్తున్నారు.

ఈ క్రమంలో ఓజి లో పవన్ ,ప్రకాష్ రాజ్ మధ్య పోటా పోటీగా డైలాగులు ఉంటే, పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. గతంలో ఇద్దరి మధ్య విమర్శలు నెలకొని ఉన్నప్పుడే 'వకీల్ సాబ్' తో వచ్చి, తమ నటనతో మెస్మరైజ్ చేసారు. పైగా పవన్ తో పాటు ప్రకాష్ రాజ్ చాలా సందర్భాల్లో మాట్లాడుతు' పొలిటికల్ గా మావి వేరు వేరు దారులైనా,సినిమాల పరంగా ఒక్కటే అని చెప్తు వస్తున్నారు. మరి పవన్ వీరాభిమానులు కూడా అలాగే భావిస్తారేమో చూడాలి. ఏది ఏమైనా ఓజి లో పవన్, ప్రకాష్ రాజ్ ఈ సారి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ప్రత్యేకతని సంతరించుకుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.