English | Telugu

పవన్ సినిమా కోసం భారీ సెట్

పవన్ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారంటే దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న "కెమెరా మేన్ గంగతో రాంబాబు" అనే చిత్రం కోసం ఈ భారీ సెట్ ను వేయిస్తున్నారు. హైదరాబాద్ సారథీ స్టుడియోలో ఈ భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పవన్ సరసన హీరోయిన్ గా నటించనుందట.

ప్రస్తుతం మాస్ మహరాజా రవితేజ హీరోగా "దేవుడు చేసిన మనుషులు" చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి రఘు కుంచే చాలా చక్కని సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ హీరోగా నటించే "కెమెరా మేన్ గంగతో రాంబాబు" చిత్రానికి పూరీ జగన్నాథ అదర్శకత్వం వహిస్తారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.