English | Telugu

డబ్బింగ్ లో "దేవుడు చేసిన మనుషులు"

డబ్బింగ్ లో "దేవుడు చేసిన మనుషులు"...వివరాల్లోకి వెళితే మాస్ మహరాజా రవితేజ హీరోగా, నలకనడుము గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం"దేవుడు చేసిన మనుషులు". ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ "దేవుడు చేసిన మనుషులు" చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరుపుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయా రికార్డింగ్ థియేటర్లో జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో ఈ చిత్రం ఆడియోని విడుదల చేసి, జూలై నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో పద్మాలయా పతాకంపై, యన్.టి.ఆర్, కృష్ణ హీరోలుగా, సూపర్ స్టార్ కృష్ణ ఇదే పేరు మీద ఒక చిత్రాన్ని నిర్మించగా అది సూపర్ హిట్టయ్యింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.