English | Telugu

మహాన్యూస్ పై బిఆర్ఎస్ పార్టీ దాడి చేయడంపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే 

తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ టాపింగ్ జరిగిందనే వార్తలని, మహా న్యూస్ ఛానల్ కొన్ని రోజుల నుంచి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా ఫోన్ టాపింగ్ కథనాల గురించి సదరు న్యూస్ ఛానల్ ప్రసారం చేస్తు ఉంది. దీంతో కొంత మంది బిఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ లోని మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసి, కొన్ని రకాల కారుల అద్దాలని పగలకొట్టడంతో పాటు ఆఫీస్ లోపలకి చొరబడ్డారు.

ఈ దాడిని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండిస్తూ' మీడియాలో వచ్చే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే, తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఆ దారిలో వెళ్లకుండా అందుకు భిన్నంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఈ దాడిని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి. దాడికి కారణమైన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ కి పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేసాడు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.