English | Telugu

శింబు ‘ప‌త్తు త‌ల‌’ టీజ‌ర్ అనౌన్స్‌మెంట్‌

ప‌త్తు త‌ల సినిమాకు సంబంధించిన టీజ‌ర్ న్యూస్‌ని ప్ర‌క‌టించారు. క‌న్న‌డ‌లో శివ‌రాజ్‌కుమార్ న‌టించిన సినిమా మఫ్టి. ఇప్పుడు ఈ సినిమాను త‌మిళ్‌లో ప‌త్తు త‌ల పేరుతో రీమేక్ చేశారు. సిల్లున్ను ఒరు కాద‌ల్‌, నెడుంజాలై సినిమాల‌ను తెర‌కెక్కించిన కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ప‌త్తు త‌లై. ప్రియా భ‌వానీ శంక‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం స‌మ‌కూర్చారు. స్టూడియో గ్రీన్ త‌ర‌ఫున జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల శింబు పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ప‌త్తు త‌ల సినిమా నుంచి న‌మ్మ స‌త్తం అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్. మార్చి 3 సాయంత్రం 5.31కి ప‌త్తుత‌ల టీజ‌ర్‌ని విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. కామ్ బిఫోర్ ద స్టార్మ్ అంటూ ఈ విష‌యాన్ని అనౌన్స్ చేశారు మేక‌ర్స్. మార్చి 30 నుంచి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది ప‌త్తుత‌ల‌. ఆ మ‌ధ్య వ‌రుస ఫ్లాప్‌లు చూసిన శింబు, ఇప్పుడు కాస్త కెరీర్‌లో మ‌ళ్లీ గ్రిప్ తెచ్చుకుంటున్నారు. లాస్ట్ ఇయ‌ర్ వెందు త‌నింద‌దు కాడు అనే సినిమా చేశారు శింబు. ఆ చిత్రానికి త‌మిళ్‌లో చాలా మంచి పేరు వ‌చ్చింది. త్వ‌ర‌లోనే శింబుకి పెళ్లి అనే వార్త‌లు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

శ్రీలంక‌కు చెందిన అమ్మాయిని శింబుకి ఇచ్చి చేయాల‌న్న‌ది పెద్ద‌ల నిర్ణ‌యం. అమ్మాయిని చూసిన శింబు త‌న‌కు న‌చ్చింద‌ని చెప్ప‌డంతో పెద్ద‌లు మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే, మ‌రోవైపు పాట‌లు కూడా పాడుతున్నారు శింబు. ఈ మ‌ధ్య ప‌ట్టుద‌ల‌తో బ‌రువు కూడా త‌గ్గారు. శింబు ఇప్పుడు చేసిన‌ట్టే జాగ్ర‌త్త‌గా సినిమాలు ప్లాన్ చేసుకుంటే, మ‌రో ప‌దీ, పాతికేళ్లు కెరీర్‌కి తిరుగు ఉండ‌దు అని అంటున్నారు ఫ్యాన్స్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.