English | Telugu

పవన్ కళ్యాణ్ ని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి!

ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ హీరోల సినిమాలు ఒక్కోటి పూర్తి కావడానికి రెండు మూడేళ్లు పడుతుంది. దీంతో అభిమానులు నిరాశచెందుతున్నారు. థియేటర్లు కూడా చాలా కాలం పాటు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని చూసి, మిగతా స్టార్స్ నేర్చుకోవాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Pawan Kalyan)

పవన్ కళ్యాణ్ తప్ప దాదాపు మిగతా స్టార్స్ అందరికీ సినిమా తప్ప వేరే లోకం లేదు. అయినప్పటికీ వారి నుంచి ఏడాదికి ఒక్క సినిమా కూడా రావట్లేదు. కానీ, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. వరుస సినిమాలతో అలరిస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం కాకముందు.. 2021లో 'వకీల్ సాబ్', 2022లో 'భీమ్లా నాయక్', 2023లో 'బ్రో'.. ఇలా ఏడాదికి ఒక్క సినిమా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది. 2024లో పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇక ఆయన చేతిలో ఉన్న సినిమాలు కూడా పూర్తి కావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

'హరి హర వీరమల్లు' ఆగిపోయింది అన్నారు, 'ఓజీ' ఆలస్యమన్నారు, 'ఉస్తాద్ భగత్ సింగ్' అసలు ఉండకపోవచ్చు అన్నారు. కట్ చేస్తే.. కేవలం కొద్ది నెలల గ్యాప్ లోనే.. ఈ మూడు సినిమాల పెండింగ్ షూట్ ని పూర్తి చేసేశారు పవన్ కళ్యాణ్. మొదట 'హరి హర వీరమల్లు' షూటింగ్ కంప్లీట్ చేశారు. అది జూలై 24న విడుదలైంది. అదే స్పీడ్ లో 'ఓజీ' షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఆ సినిమా ఈ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక తాజాగా ఆయన.. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూట్ కూడా కంప్లీట్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఈ మూవీ డిసెంబర్ లేదా జనవరిలో విడుదలయ్యే అవకాశముంది.

పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ గా, డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. షూట్ బ్యాలెన్స్ ఉన్న తన మూడు సినిమాలను వేగంగా పూర్తి చేశారు. అలాంటిది సినిమాలే ప్రపంచంగా బ్రతుకుతున్న స్టార్స్.. కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.