English | Telugu

'జల్సా'ను దాటేసిన 'ఆరెంజ్'!

రామ్ చరణ్, జెనీలియా జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆరెంజ్'. 'మగధీర' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ నటించిన సినిమా కావడంతో పాటు, హేరిస్ జయరాజ్ స్వరపరిచిన పాటలు పెద్ద హిట్ అవ్వడంతో అప్పట్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2010 నవంబరు 26న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేక పరాజయం పాలైంది. అయితే ఆ తర్వాత ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. అప్పుడసలు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని మెగా ఫ్యాన్స్ ఇప్పటికీ ఫీల్ అవుతుంటారు. అలా ఫీలయ్యే ఫ్యాన్స్ కోసం ఇటీవల ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా, అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.

కొంతకాలంగా టాలీవుడ్ స్టార్స్ నటించిన పలు సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. అదే బాటలో రామ్ చరణ్ పుట్టినరోజు(మార్చి 27) సందర్భంగా 'ఆరెంజ్' సినిమాను మళ్ళీ విడుదల చేశారు. ఈ మూవీ ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.42 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది. ఓవరాల్ గా రీరిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో రూ.3.15 గ్రాస్ రాబట్టిన ఆరెంజ్.. వరల్డ్ వైడ్ గా రూ.3.36 కోట్ల గ్రాస్ సాధించింది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. రీరిలీజ్ లు, స్పెషల్ షోలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలలో రూ.7.30 కోట్ల గ్రాస్ తో 'ఖుషి' టాప్ లో ఉంది. మొన్నటివరకు రూ.3.20 కోట్ల గ్రాస్ తో 'జల్సా' రెండో స్థానంలో ఉండగా.. రూ.3.36 కోట్ల గ్రాస్ తో ఇప్పుడు ఆ ప్లేస్ లోకి 'ఆరెంజ్' వచ్చింది. రూ.2.54 కోట్ల గ్రాస్ తో 'ఒక్కడు', రూ.1.73 కోట్ల గ్రాస్ తో 'పోకిరి', రూ.1.65 కోట్ల గ్రాస్ తో 'దేశముదురు', రూ.1.10 కోట్ల గ్రాస్ తో 'చెన్నకేశవరెడ్డి', రూ.1.05 కోట్ల గ్రాస్ తో 'బిల్లా' ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.