English | Telugu

గుసగుసలు అందరికీ నచ్చుతున్నాయి


ఊహలు గుసగుసలాడే చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆంధ్ర, తెలంగాణాలతో పాటు ఓవర్‌సీస్ లోను మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యూత్ ఆడియెన్స్ తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా చూసి అభినందించారు. హీరో నానీ, దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి తదితరలు ఈ చిత్ర ప్రివ్యూ చూసి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ కూడా ఈ చిత్రం చూసిన వారిలో వున్నారు. ఇక తాజాగా ఊహల గుసగసలను చూసి అభినందించిన వారి లిస్టులో టాలీవుడ్ సింగర్స్ కూడా చేరారు.

లో బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఆడియెన్స్, ఇండస్ట్రీ ఇలా ఆదరించడం చూసి యూనిట్ ఎంతో సంబరపడుతోంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించాడు. వారాహి బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించారు.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.