English | Telugu

ఓజి నిర్మాతపై క్రిమినల్ కేసు.. డబ్బులు వెనక్కి ఇస్తారా!

ఓజి(OG)కి తెలంగాణ(Telangana)రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల పెంపుకి పర్మిషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తు ప్రముఖ అడ్వకేట్ మల్లేష్ యాదవ్ హైకోర్టు లో పిటిషన్ వెయ్యడం తెలిసిన విషయమే.ఈ విషయంలో రీసెంట్ గా మల్లేష్ యాదవ్ మాట్లాడుతు తెలంగాణ హైకోర్ట్ ఇరవై ఐదవ తారీకు మధ్యాహ్నం నుంచే 'ఓజి' టికెట్ రేట్స్ తగ్గించాలని ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఓజి ని నిర్మించిన డివివి ఎంటర్ టైన్ మెంట్స్ రేట్లు తగ్గించలేదు. ఈ విషయంలో పోరాడుతున్న నాపై సదరు సంస్థ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తు వస్తున్నారు. పైగా కోర్ట్ ఉత్తర్వులని పాటించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది.

కాబట్టి నేను డివివి క్రియేషన్స్(DVV Creations)కి లీగల్ నోటీసు పంపించడమే కాకుండా క్రిమినల్ కేసు కూడా నమోదు చేయబోతున్నాను. కోర్టు జీవో వచ్చిన తర్వాత ఓజి ని ఎక్కువ డబ్బు పెట్టి చూసిన వాళ్ళు, తమ డబ్బు ఇవ్వమని కూడా డివివి సంస్థని అడగవచ్చు. మేము పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకం కాదు.టికెట్ ధరలు పెంచి అభిమానులతో పాటు ప్రేక్షకుల డబ్బులు దోచుకోవడానికే వ్యతిరేకమని మల్లేష్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.