English | Telugu

ఇద్దరు స్టార్‌ హీరోలతో ‘లోక2’.. చిల్‌ అవుతున్న మైఖేల్‌, చార్లీ!

కళ్యాణి ప్రియదర్శన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘లోక చాప్టర్‌1: చంద్ర’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా దాదాపు 300 కోట్లు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘లోక2’ రాబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్‌. లోక1లో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చిన దుల్కర్‌ సల్మాన్‌, టొవినో థామస్‌.. పార్ట్‌2లో హీరోలుగా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. దుల్కర్‌, టొవినో ఇద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘వెన్‌ లెజెండ్స్‌ చిల్‌.. మైఖెల్‌ అండ్‌ చార్లీ..’ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

లోక2 గురించి ఇంతకుముందు వచ్చిన వార్తల్లో టొవినో మాత్రమే హీరోగా నటిస్తున్నాడని చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడది ఇద్దరు హీరోల సినిమా అని కన్‌ఫర్ట్‌ చేశారు. చాప్టర్‌ 1లో ఉన్నట్టుగానే చాప్టర్‌2లో కూడా చాలా సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. లోక సినిమాతో నిర్మాతగా కూడా తనని తాను ప్రూవ్‌ చేసుకున్నాడు దుల్కర్‌. లోక 1లో మాదిరిగానే చాప్టర్‌2లో కూడా ఎవరూ ఊహించని కాంబినేషన్‌ కనిపిస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా దుల్కర్‌.. మలయాళంలోనే కాదు, తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. కాబట్టి లోక మాదిరిగానే లోక2 కూడా భారీ విజయాన్ని అందుకుంటుందన్న కాన్ఫిడెన్స్‌ దుల్కర్‌కి ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.