English | Telugu

టెంప‌ర్ మ‌ళ్లీ లీక‌య్యిందోచ్‌

ఫక్ట్ లుక్ కంటే ముందే ఎన్టీఆర్ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాయ్‌. ఇప్పుడు టీజ‌ర్ రాకుండానే క‌థ లీకైపోయింది. ఇంత‌కీ టెంప‌ర్ క‌థేంటంటే... ఎన్టీఆర్ ఓ అనాథ‌. చిన్న‌ప్పుడు తిండీ తిప్ప‌లు లేక అల్లాడిపోతాడు. ఓ అవినీతి పోలీస్ ఆఫీస‌ర్ ని చూసి ''నేనూ పోలీస్ అయితే అలానే డ‌బ్బులు సంపాదించొచ్చు క‌దా..'' అని డిసైడ్ అవుతాడు. అప్ప‌టి నుంచీ ఒక్క‌టే ల‌క్ష్యం.. పోలీస్ కావ‌డం. చివ‌ర‌కు పోలీస్ అవుతాడు. దొరికిందంతా దోచుకొంటాడు. వైజాగ్ దాదా అయిన ప్ర‌కాష్‌రాజ్‌తో బేరం పెట్టుకొంటాడు. దొంగ పోలీస్ లా కార్లు, బంగ‌ళాలూ సంపాదిస్తాడు. చివ‌రికి ''నేను చేస్తోంది త‌ప్పు..'' అనే సంగ‌తి తెలుస్తుంది. ఆ త‌ర‌వాత మార్పు వ‌స్తుంది. ఎవ‌రి అరాచ‌కాలకు అండ‌గా నిలిచాడో, వాళ్ల‌నే తుక్కు రేగ్గొట్ట‌డం స్టార్ట్ చేస్తాడు.. త‌న టెంప‌ర్ చూపిస్తాడు. అదీ టెంప‌ర్ క‌థ‌. ఇదంతా వింటుంటే ల‌క్ష్మీన‌ర‌సింహా గుర్తొస్తుంది క‌దూ. మ‌రి పూరికి మాత్రం ఈ బ‌ల్బ్ వెల‌గ‌లేదేమో..? క‌థ పాత‌దైనా పూరి జ‌గ‌న్నాథ్‌కి క‌థ‌నంతో మ్యాజిక్ చేసే ద‌మ్ముంది. ఆయ‌న కూడా దాన్నే న‌మ్ముకొన్నాడేమో. మ‌రి తెర‌పై 'ల‌క్ష్మీన‌ర‌సింహా 2' ఎంత హంగామా చేస్తుందో ఏంటో..??

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.