English | Telugu

ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ అందించిన అరుదైన గౌరవం!

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన నటుల్లో ఎన్టీఆర్‌ ఒకరు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఎన్టీఆర్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ఎన్టీఆర్‌ నటన అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఒక పరిపూర్ణ నటుడిగా అవతరించాడు ఎన్టీఆర్‌. ఇప్పుడు బాలీవుడ్‌ మూవీ ‘వార్‌ 2’లో ఎన్టీఆర్‌ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కూడా భాగమవడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్‌కు ఒక అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ సినీ చరిత్రలో ప్రతిష్ఠాత్మకంగా పేర్కొనదగిన ‘ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌’లో ఎన్టీఆర్‌కు స్థానం దక్కింది. ‘ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌’లో కొత్త మెంబర్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌లో ఎన్టీఆర్‌ పేరును కూడా జతచేశారు. ఈ ఏడాది ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు నటులకు చోటు దక్కింది. వీరిలో తారక్‌తో పాటు కె.హుయ్‌ క్వాన్‌, కెర్రీ కాండన్‌, రోసా సలాజర్‌, మార్షా స్టెఫానీ బ్లేక్‌ ఉన్నారు. ఇంతటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్‌ను టాలీవుడ్‌తోపాటు దేశంలో ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని నటనకు ఎన్టీఆర్‌కు ఎలాంటి అవార్డు రాలేదని అభిమానులు ఎంతో నిరాశతో వున్నారు. ఈ సమయంలో ఆస్కార్‌ నటుల జాబితాలో ఎన్టీఆర్‌కు కూడా స్థానం లభించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానుల ఆనందానికి అంతులేదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.