English | Telugu

ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఏది కలిసిరాని హీరో ఎవరంటే ఎన్టీఆరేనని చెప్పాలి. ఎందుకంటే అగ్ర హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ కి గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకోదగిన హిట్ లేకపోవడమే. దాని కోసం అతను ఎంత కృషి చేసిన కాలం కలిసిరావడం లేదు. ప్రస్తుతం రిలీజ్ కి సిద్దమవుతున్న శ్రీమంతుడు సినిమా స్టొరీని కొరటాల ముందు చెప్పింది ఎన్టీఆర్ కేనట.

అప్పుడు ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు కూడా. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఆగిపోయింది. ఆ తరువాత కొరటాల శివ ఈ సినిమాని మహేష్ కి చెప్పడం వెంటనే సెట్స్ పైకి వెళ్ళడం చకచక జరిగిపోయాయి. ఆగస్ట్ 7న రిలీజ్ కాబోతున్న 'శ్రీమంతుడు' టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పాత విషయం పక్కన పెడితే మళ్ళీ ఈ కాంబినేషన్ పట్టాలెక్కబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఎన్టీఆర్ కోసం కొరటాల ఓ స్టోరీ సిద్ధం చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం శ్రీమంతుడు షూటింగ్ పూర్తి కావచ్చింది... అయితే సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళుతోంది. సో.. సుకుమార్ సినిమా పూర్తయ్యాకే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా 2016లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుందని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.