English | Telugu

పూరీ సినిమాలో జేమ్స్ బాండ్ గా యన్.టి.ఆర్.

పూరీ సినిమాలో జేమ్స్ బాండ్ గా యన్.టి.ఆర్. నటించనున్నాడని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మించే చిత్రం ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో యన్.టి.ఆర్. జేమ్స్ బాండ్ తరహాలో ఉండే పాత్రలో నటించనున్నారట. ఈ చిత్రం మొత్తం దాదాపు అమెరికాలోనే చిత్రీకరించనున్నారట.

గతంలో "ఆంధ్రావాలా" వంటి ఫ్లాప్ చిత్రాన్ని అందించిన దానికి ప్రతిగా ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసి, ఆ ఫ్లాప్ వెలితిని పూడుస్తానని దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటున్నాడని సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఏమైనా చేయగలడు. "ఆంధ్రావాలా" లాంటి ఫ్లాపులివ్వగలడు..."బిజినెస్ మ్యాన్" వంటి బ్లాక్ బస్టర్ నీ ఇవ్వగలడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.