English | Telugu

యన్.టి.ఆర్. కారు యాక్సిడెంట్ కేసు కొట్టేశారు

యన్.టి.ఆర్. కారు యాక్సిడెంట్ కేసు కొట్టేశారు. వివరాల్లోకి వెళితే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికి వెళ్లిన జూనియర్ యన్.టి.ఆర్. నల్గొండ జిల్లాలో, సూర్యాపేట సమీపంలోని మోతే గ్రామంలో కారుప్రమాదానికి గురయ్యారు. అక్కడి పోలీసులు యన్.టి.ఆర్. మీద సెక్షన్ 338 ప్రకారమ కేసు నమోదు చేశారు. ఆ కేసుని సూర్యాపేట లోక్ అదాలత్ కేసు ప్రస్తుతం కొట్టేశారు.

ఈ కేసు జడ్జిమెంట్ కోసం యన్.టి.ఆర్. తో పాటు యన్.టి.ఆర్. స్నేహితుడు, నటుడు రాజీవ్ కనకాల కుడా కోర్టుకి వెళ్ళారు. ఈ కేసులో నుండి బయటకు రావటం యన్.టి.ఆర్.కి పెద్ద రిలీఫ్, యన్.టి.ఆర్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో, "దమ్ము" చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో యన్.టి.ఆర్. సరసన త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.