English | Telugu

రూ.50 కోట్ల క‌బ్ల్‌... ఎన్టీఆర్ కి సాధ్య‌మేనా??

బాలీవుడ్‌లో వంద కోట్ల క్ల‌బ్ స‌ర్వ‌సాధార‌మైపోయింది. ఓ మాదిరి సినిమా కూడా తొలి రెండు మూడు రోజుల్లో వంద కోట్ల మైలు రాయిని చేరుకొని జెండా ఎగ‌రేస్తోంది. బాలీవుడ్ సినిమాకి అంత‌ర్జాతీయంగా మార్కెట్ ఉంటుంది కాబ‌ట్టి వంద కోట్లు పెద్ద విష‌యం ఏమీ కాదు. బాలీవుడ్ లొ వంద కోట్లు ఎలానో, టాలీవుడ్‌లో రూ.50 కోట్ల క్ల‌బ్ కూడా అంతే. రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర్జున్‌, బాల‌కృష్ణ‌... వీళ్లంద‌రూ రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయారు. మిగిలింది ఎన్టీఆర్ ఒక్క‌డే. బాద్ షా ఈ మైలు రాయికి ఇంచుమించు ద‌గ్గ‌ర‌గా వెళ్లింది. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ సినిమాలన్నీ ఫ్లాప్ టాక్‌ని మూట‌గ‌ట్టుకోవ‌డంతో రూ.30 కోట్లు కూడా ద‌క్కించుకోలేదు. టెంప‌ర్‌తో ఆ ఆశ నెర‌వేరుతుంద‌ని భావించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తొలి రోజే హిట్ టాక్ రావ‌డంతో ఈ సినిమా కనీసం రూ.70 కోట్లు సాధిస్తుంద‌ని లెక్క‌లు వేసుకొన్నారు. తీరా చూస్తే ఇప్పుడు రూ.50 కోట్ల మైలు రాయిని చేరుకోవ‌డం కూడా క‌ష్ట‌త‌రంగా మారింది. రెండో రోజు నుంచీ వ‌సూళ్లు అనూహ్యంగా ప‌డిపోయాయి. ఆది వారం కూడా అంతంత మాత్ర‌మే వ‌సూలు చేసింది. మొత్త‌మ్మీద ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.28 కోట్ల షేర్ సాధించింద‌ని అంచ‌నా. ఆ లెక్క‌న ఈ సినిమా రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుందా??అనే అనుమానాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాకి దాదాపుగా రూ.45 కోట్లు (వడ్డీల‌తో క‌లుపుకొని) అయ్యింది. క‌నీసం ఈ డ‌బ్బులొచ్చినా అదే ప‌ది వేలు అనుకొంటోంది చిత్ర‌బృందం. శాటిలైట్ రూ.7.5 కోట్ల‌కు అమ్ముడుపోయింది. అదే.. లాభం అనుకోవాలి. కుటుంబ ప్రేక్ష‌కులు ఈ సినిమాకి దూరం అవ్వ‌డం, రిపీటెడ్ ఆడియ‌న్స్ లేకపోవ‌డం టెంప‌ర్‌కి శాపంగా మారింది. ఇక ఈ సినిమా రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరాలంటే ఎన్టీఆర్ అభిమానులే పూనుకోవాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.