English | Telugu

రవితేజ "నిప్పు" ఆడియో 23 న

రవితేజ "నిప్పు" ఆడియో 23 వ తేదీన విడుదల చేయనున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే బొమ్మరిల్లు వారి పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, దీక్షాసేథ్ హీరోయిన్ గా, అద్భుతమైన టెక్నికల్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో, ప్రముఖ దర్శక, నిర్మాత వై.వి.యస్.చౌదరి తన బావమరిది కిశోర్ నిర్మాతగా తీస్తున్న చిత్రం "నిప్పు". ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ టర్కీ దేశంలో షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్ 19 వ తేదీ రాత్రికి ఈ చిత్రం యూనిట్ ఇండియాకి వస్తుంది.

బహుశా డిసెంబర్ 23 వ తేదీ ఈ "నిప్పు" చిత్రం యొక్క ఆడియో విడుదల చేస్తారని తెలిసింది. ఎందుకంటే డిసెంబర్ 22 వ తేదీన మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపాపై డాక్టర్‍ వెంకట్ నిర్మిస్తున్న "బిజినెస్ మ్యాన్" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ కాబోతుంది. కనుక "నిప్పు" ఆడియో డిసెంబర్ 23 న కానీ 24 న కానీ విడుదల చేయ్యొచ్చని అంచనా.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.