English | Telugu

పవన్ హీరోయిన్ ని పడేసిన గుర్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పులి' సినిమా హీరోయిన్ నికిషా పటేల్ ని గుర్రం కింద పడేసి౦దట. టాలీవుడ్ లో అవకాశాలు దక్కకపోవడంతో కన్నడ, తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా ఓ కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నికిషాకి ఓ చేదు అనుభవం ఎదురైంది. 'ఆలోనే' మూవీ కోసం గుర్రపు స్వారీ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఆమె కింద పడిపోయిందట. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు కూడా కంగారుపడ్డారట. అయితే తనకు దెబ్బలు కూడా బాగానే తగిలాయని నికిషా పటేల్ ట్విట్టర్ లో పేర్కొంది. ప్రస్తుతం తను రెస్ట్ తీసుకుంటోంది. కొంచెం కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొంటా అని పేర్కొంది నికిషా. ప్రస్తుత౦ నికిషా పటేల్ చేతిలో.. 'నరతన్', 'సిగండి' అనే మరో రెండు తమిళ్ సినిమాలు రెడీగా వున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.