English | Telugu

నిహారికపై ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్‌ చేసిన మాజీ భర్త!

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. విడాకుల తర్వాత ఎవరి కెరీర్‌ వారు చూసుకుంటూ మీడియాకు దూరంగా ఉంటూ ఉంటారు. కానీ, మెగా డాటర్‌ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మాత్రం తరచూ సోషల్‌ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ప్రేమించుకొని ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. విడాకుల తర్వాత నిహారిక ఏదో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉంటోంది. అలాగే చైతన్య కూడా తన పనిలో తాను బిజీగానే ఉంటున్నాడు.

సోషల్‌ మీడియాలో తరచూ వీరిద్దరికి సంబంధించిన అప్‌డేట్స్‌ వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిహారిక చేసిన వ్యాఖ్యలు చక్కర్లు కొట్టాయి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందని, పిల్లల్ని కనాలని వుందని చెప్పింది. ఆమె చేసిన కామెంట్స్‌కి డైరెక్ట్‌గా కాకపోయినా ఇన్‌డైరెక్ట్‌గా చైతన్య తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఒకరి వాదననే ప్రచారం చేయడం కరెక్ట్‌ కాదని ఇన్‌డైరెక్ట్‌గా నిహారికకు కౌంటరు ఇచ్చాడు. సోషల్‌ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని చైతన్య పెట్టిన పోస్ట్‌లో.. ‘విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలలో మీరు కోరుకునే సైలెన్స్‌.. ఇలా నిశ్శబ్దం అనేది మీ ప్రాణశక్తిని మీ నుంచి వేరు చేస్తుంది. మౌనం దేవుడితో కలిపే మాధ్యమం’ అని పోస్ట్‌ చేశాడు. అతను ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్‌ పెట్టాడో తెలీదుగానీ నెటిజన్లు మాత్రం దానికి స్పందిస్తున్నారు. అతని పోస్టుకు రకరకాల కామెంట్స్‌ పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. మరి దీనికి నిహారిక ఎలా స్పందిస్తుందో.. ఈసారి ఆమె ఏం పోస్ట్‌ పెడుతుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .