English | Telugu

నేను ఏడిస్తే నచ్చదు

రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం "బలుపు". ఈ చిత్రం జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం గురించి రవితేజ మాట్లాడుతూ... "డాన్ శీను" చిత్రం తర్వాత గోపీచంద్ తో చేయడం చాలా బాగుంది. ఫుల్ మాస్, మసాల, కామెడీ చిత్రంగా ఉంటుంది. నా కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం "బలుపు". థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. నేను పాడిన పాట కూడా మంచి హిట్టయ్యింది. నేను నవ్విస్తేనే బాగుంటది. ఏడిస్తే జనాలేవరికి నచ్చదు. అందుకే "దరువు" మంచి సినిమా అయిన కూడా అందులో నా క్యారెక్టర్ కాస్త ఏడుపు సీన్ లలో కనిపించేసరికి ఎవరికి అంతగా నచ్చలేదు. కానీ నా చిత్రంలో ఎంతవరకు అభిమానులను ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటారో అవన్నే బలుపు చిత్రంలో ఉంటాయి. శ్రుతిహాసన్, అంజలి మంచి పాత్రలలో నటించారు. బ్రహ్మానందంతో చేసిన కామెడీ అదిరిపోయింది. ఈ చిత్రం సూపర్ హిట్టవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

మరి జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "బలుపు" చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై సూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రం కూడా విడుదలై మంచి విజయం సాధించాలని కోరుకుంటూ... "బలుపు" చిత్రానికి ఆల్ ది బెస్ట్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.