English | Telugu

రామ్ చరణ్ హీరోయిన్ దర్శకురాలిగా మారనుందా!

సిల్వర్ స్క్రీన్ పై ఎంతో మంది మహిళా దర్శకులు విభిన్న చిత్రాలని తెరకెక్కించి ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు. కానీ హీరోయిన్ గా సక్సెస్ ని అందుకొని, కొంత గ్యాప్ తర్వాత దర్శకురాలిగా మారడం అనేది చాలా అరుదు. గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)సిల్వర్ స్క్రీన్ పై హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం చిరుత(Chirutha). ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన భామ 'నేహాశర్మ'(Neha Sharma). తొలి చిత్రంతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకొని, ఆ తర్వాత కుర్రోడు చిత్రంలో వరుణ్ సందేశ్ తో జత కట్టింది.

ఇప్పుడు నేహాశర్మ దర్శకురాలిగా మారనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్(Ajay Devgn)నిర్మాణ సారధ్యంలో సదరు చిత్రం తెరకెక్కబోతుందని, సిద్దాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi),మోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారనే చర్చ జోరుగానే నడుస్తుంది. 1945 వ సంవత్సరం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టుగా టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుందని అంటున్నారు.

చిరుత, కుర్రోడు చిత్రాల తర్వాత నేహాశర్మ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు పొందింది. తమిళ, మలయాళ, పంజాబీ భాషల్లో సుమారు పదిహేను చిత్రాల వరకు చేసిన నేహా, నాచురల్ స్టార్ నాని(Nani),మృణాల్ ఠాకూర్(Mrunal thakur)జంటగా వచ్చిన 'హాయ్ నాన్న' లో క్యామియో రోల్ లో కనిపించింది. సోలో హీరోయిన్ గా 2023 లో నవాజుద్దీన్ సిద్ధికి తో కలిసి 'జోగిరా సరా రా రా' అనే చిత్రంలో చేసింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.