English | Telugu

రామ్ చరణ్ హీరోయిన్ దర్శకురాలిగా మారనుందా!

సిల్వర్ స్క్రీన్ పై ఎంతో మంది మహిళా దర్శకులు విభిన్న చిత్రాలని తెరకెక్కించి ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు. కానీ హీరోయిన్ గా సక్సెస్ ని అందుకొని, కొంత గ్యాప్ తర్వాత దర్శకురాలిగా మారడం అనేది చాలా అరుదు. గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)సిల్వర్ స్క్రీన్ పై హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం చిరుత(Chirutha). ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన భామ 'నేహాశర్మ'(Neha Sharma). తొలి చిత్రంతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకొని, ఆ తర్వాత కుర్రోడు చిత్రంలో వరుణ్ సందేశ్ తో జత కట్టింది.

ఇప్పుడు నేహాశర్మ దర్శకురాలిగా మారనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్(Ajay Devgn)నిర్మాణ సారధ్యంలో సదరు చిత్రం తెరకెక్కబోతుందని, సిద్దాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi),మోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారనే చర్చ జోరుగానే నడుస్తుంది. 1945 వ సంవత్సరం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టుగా టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుందని అంటున్నారు.

చిరుత, కుర్రోడు చిత్రాల తర్వాత నేహాశర్మ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు పొందింది. తమిళ, మలయాళ, పంజాబీ భాషల్లో సుమారు పదిహేను చిత్రాల వరకు చేసిన నేహా, నాచురల్ స్టార్ నాని(Nani),మృణాల్ ఠాకూర్(Mrunal thakur)జంటగా వచ్చిన 'హాయ్ నాన్న' లో క్యామియో రోల్ లో కనిపించింది. సోలో హీరోయిన్ గా 2023 లో నవాజుద్దీన్ సిద్ధికి తో కలిసి 'జోగిరా సరా రా రా' అనే చిత్రంలో చేసింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.