English | Telugu

నాగార్జున సోదరి మృతి.. అక్కినేని కుటుంబంలో విషాదం!

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈమధ్యకాలంలో ఎంతో మంది ప్రముఖులు కన్నుమూశారు. ఇప్పుడు అక్కినేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె, నాగార్జున సోదరి నాగ సరోజ మృతి చెందారు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఆమె తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. అక్కినేని కుమార్తె అనగానే అందరికీ నాగసుశీల పేరే తెలుసు. కానీ, నాగసరోజ పేరు మాత్రం ఎక్కడా వినిపించదు, కనిపించదు. సినిమా రంగానికి ఆమె ఎప్పుడూ దూరంగానే ఉంటారు. అందుకే ఆమె మరణ వార్త కూడా ఆలస్యంగానే తెలిసింది.

అక్కినేని నాగేశ్వరరావుకి ఐదుగురు సంతానం. సత్యవతి, నాగసుశీల, నాగ సరోజ, వెంకట్‌, నాగార్జున. సత్యవతి చాలా కాలం క్రితమే కాలం చేశారు. ఇప్పుడు నాగసరోజ అనారోగ్యంతో మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె మరణం అక్కినేని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.