English | Telugu

వరుస వివాదాల్లో మృణాల్.. విరుచుకుపడుతున్న అనుష్క ఫ్యాన్స్!

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ముఖ్యంగా ఎక్కువగా జనాల్లో నానే సినీ ప్రముఖులు.. తమ నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ఈ విషయాన్ని ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గుర్తించలేకపోతోంది. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతున్న ఆమె.. అనవసరమైన వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. (Mrunal Thakur)

ఆ మధ్య బిపాసా బసు గురించి 'మగాడి మజిల్స్ ఉన్న అమ్మాయి' అంటూ కామెంట్స్ చేసి ట్రోల్స్ కి గురైంది మృణాల్. ట్రోల్స్ దెబ్బకి దిగొచ్చి.. బిపాసా బసుకి క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఇప్పుడు మృణాల్, మరో వివాదంలో చిక్కుకుంది. అనుష్క శర్మను కించపరిచేలా పరోక్ష వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటోంది. (Anushka Sharma)

మృణాల్ ఠాకూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అందులో ఆమె రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాల ప్రస్తావన వచ్చింది. తాను కొన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నానని చెప్పిన మృణాల్.. సుల్తాన్ సినిమా పైనా, అందులో హీరోయిన్ గా నటించిన అనుష్క శర్మ పైనా పరోక్ష వ్యాఖ్యలు చేసింది.

"అప్పుడు నేను రెడీగా లేకపోవడంతో ఆ సినిమాను వదులుకున్నాను. అది సూపర్ హిట్ అయింది. హీరోయిన్ కి కూడా స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా నేను చేసుంటే.. నన్ను నేను కోల్పోయేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఆ హీరోయిన్ సినిమాలు చేయట్లేదు. నేను చేస్తున్నాను. ఇది నేను సాధించిన విక్టరీగా భావిస్తాను. ఇన్ స్టాంట్ గా వచ్చిన ఫేమ్.. ఇన్ స్టాంట్ గానే పోతుంది." అంటూ మృణాల్ ఠాకూర్ సంచలన కామెంట్స్ చేసింది.

మృణాల్ చేసిన కామెంట్స్ పై అనుష్క అభిమానులు, నెటిజెన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అనుష్క అవకాశాల్లేక నటనకు దూరం కాలేదని, ఫ్యామిలీ లైఫ్ యాక్టింగ్ కి దూరంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అయినా అనుష్క ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసిందని, అలాంటిది తనకంటే సక్సెస్ ఫుల్ అని నువ్వు ఎలా చెప్పుకుంటావని ఫైర్ అవుతున్నారు.

కాగా, అనుష్క శర్మ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. 2018 వరకు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన అనుష్క.. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ కోసం నటనకు దూరమైంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.