English | Telugu

మిరాయ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. హనుమాన్ రికార్డు అవుట్!

ప్రస్తుతం 'మిరాయ్' సినిమా పేరు మారుమోగిపోతోంది. 'హనుమాన్' వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత తేజ సజ్జా నటించిన ఈ మూవీ.. మంచి అంచనాలతో నేడు(సెప్టెంబర్ 12) థియేటర్లలో అడుగుపెట్టి, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. 'మిరాయ్' మూవీ 'హనుమాన్'ని మించిన ఓపెనింగ్స్ రాబట్టినా ఆశ్చర్యంలేదు అనిపిస్తోంది. (Mirai Movie)

అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వరల్డ్ వైడ్ గా రూ.6 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మిరాయ్.. పాజిటివ్ టాక్ రావడంతో బుకింగ్స్ లో మరింత జోష్ చూపిస్తోంది. బుక్ మై షోలో గంటకు 20 వేలకు పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయంటే.. ఫస్ట్ డేనే ఆడియన్స్ నుంచి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిరోజు రూ.10 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమని చెబుతున్నారు. అంటే ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ సాధించనుంది అన్నమాట.

'హనుమాన్' మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.24 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. 'మిరాయ్' బుకింగ్స్ చూస్తుంటే.. 'హనుమాన్'ని మించేలా రూ.25 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం లేకపోలేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.