English | Telugu

అఖిల్ సినిమాలో గ్రాఫిక్స్ మాయాజాలం

సిసింద్రీ అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. మ‌నంలో అఖిల్ స్ర్కీన్ ప్రెజెన్స్ అభిమానుల‌కు న‌చ్చేసింది. అఖిల్‌ని వెండి తెర‌పై చూసి సంబ‌ర‌ప‌డిపోయారు. అప్ప‌టి నుంచీ పూర్తిస్థాయి చిత్రంలో ఎప్పుడు చూస్తామా అని గంపెడాశ‌ల‌తో ఎదురుచూస్తూ వ‌చ్చారు. మొత్తానికి ఈ సినిమాకి క్లాప్ కొట్టేశారు. అనుకొన్న‌ట్టుగానే వినాయ‌క్‌కి ఆ బాధ్య‌త అప్ప‌టించారు. మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా మామూలు క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు. ఆరు పాట‌లూ, నాలుగు ఫైట్ల‌తో సాగిపోయే క‌థ కాదు. ఇదో సోషియో ఫాంట‌సీ. మాయ‌లూ, మంత్రాలూ ఉండ‌బోతున్నాయి. ఈ రోజుల్లో మాయ‌లూ, మంత్రాలంటే గ్రాఫిక్స్ పై ఆధార‌ప‌డాల్సిందే. దానికితోడు ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. హాలీవుడ్ స్థాయి నిపుణులూ మ‌న‌కు అందుబాటులో ఉన్నారు. కావ‌ల్సివ‌స్తే, ఏకంగా హాలీవుడ్ నిపుణ‌ల‌తో ప‌నిచేయించుకొనే స్థోమ‌త ఉంది. అందుకే అఖిల్ సినిమాలో గ్రాఫిక్స్ మాయాజాలానికి పెద్ద‌పీట వేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌. ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చే గ్రాఫిక్స్ అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తాయ‌ట‌. అఖిల్ హీరోయిజానికి ఎంత ప్రాధాన్యం ఉందో, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ అంతే ప్రాధాన్యం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి సిసింద్రీ ఎంట్రీ ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ట్రీటే అన్న‌మాట‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.