English | Telugu

4 కోట్లు వెనక్కి.. తేడా వస్తే ఇలానే ఉంటది 

సందీప్ కిషన్(Sundeep Kishan),రావు రమేష్ తండ్రి కొడుకులుగా స్క్రీన్ పై నవ్వులు పూయించిన చిత్రం 'మజాకా'. హిట్ చిత్రాల దర్శకుడు 'త్రినాథరావు నక్కిన' మరోమారు తన కమర్షియల్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తొలి రోజు హిట్ టాక్ ని తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ ని రాబట్టలేకపోవడంతో పరాజయాన్ని అందుకుంది. రాంగ్ టైంలో రిలీజ్ అయ్యిందనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపించాయి. హాస్య క్రియేషన్స్ పై రాజేష్ దండ నిర్మించగా, మరో నిర్మాత అనిల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరించాడు.

ఇక ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన బయ్యర్లు భారీనష్టాలని చవి చూసారని, దీంతో 'రాజేష్ దండ' సుమారు నాలుగు కోట్ల రూపాయలని బయ్యర్లకి తిరిగి ఇచ్చేసాడనే వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చాలా మంది బయ్యర్లు, సినిమా రిజల్ట్ తేడా కొడితే కొంత అమౌంట్ వెనక్కి ఇచ్చేలా, రిలీజ్ కి ముందే నిర్మాతతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే రాజేష్ దండ 4 కోట్లు ఇచ్చాడని అంటున్నారు. సందీప్ కిషన్ సరసన రీతూవర్మ(Ritu Varma)జంటగా నటించగా, రావు రమేష్ కి జంటగా అన్షు నటించింది. కొడుకు తన పెళ్లి కోసం, తండ్రికి మళ్ళీ ఎలా పెళ్లి చేసాడు. ఈ సందర్భంగా వాళ్లిదరు ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటనేదే ఈ చిత్ర కథ. ఫిబ్రవరి 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజేష్ దండ ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తో 'కె రాంప్'(K Ramp)అనే మూవీ చేస్తున్నాడు. అక్టోబర్ 18 న ఈ చిత్రం విడుదల కానుంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం