English | Telugu

రిలేషన్స్ నా జీవితాన్ని నాశనం చేసాయి.. శక్తి వృధా అయ్యింది 

భారతీయ సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు 'మనీషా కొయిరాలా'(Manisha Koirala). 90 వ దశకంలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మనీషా తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. క్రిమినల్, భారతీయుడు, బొంబాయి, వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయిన మనీషా, 2012 లో కాన్సర్(Cancer)బారిన పడింది. కొన్ని సంవత్సరాల పాటు కాన్సర్ తో పోరాడి మళ్ళీ సినిమాల్లో రి ఎంట్రీ ఇచ్చింది.

రీసెంట్ గా మనీషా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'నా జీవితంలో రిలేషన్ షిప్స్ కారణంగా ఎక్కువ సమయం, శక్తి వృధా అయ్యింది. మనిషి జీవితంలో బ్యాడ్ ఫేజ్ ఉండటం సహజం. కానీ రిలేషన్ వల్ల అనారోగ్య ప్రభావాలు ఎదుర్కోవడంతో, వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడింది. ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను. ఇలాగే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. స్వతంత్రంగా జీవించడం గొప్ప అనుభవమని మనీషా చెప్పుకొచ్చింది.

నానాపటేకర్, విషేక్ ముష్రాన్, 'ఆర్యన్ వెడ్' తో పాటు పలు హాలీవుడ్ నటులతో మనీషా రిలేషన్ లో ఉన్నట్టుగా 'గాసిప్స్' వినిపించాయి. 2010 లో నేపాల్ కి చెందిన వ్యాపార వేత్త 'సామ్రాట్ దహల్'(Samrat Dahal)తో వివాహం జరగగా, రెండు సంవత్సరాలకే మనీషా విడిపోయింది. 1991 లో సినీ రంగ ప్రవేశం చేసిన మనీషా తన కెరీర్ లో ఇప్పటివరకు సుమారు 70 చిత్రాల వరకు చేసింది. 2023 లో వచ్చిన 'షెహ్ దాజా' తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.