English | Telugu

అయోధ్యరాముడి విషయంలో మంచు మనోజ్ కీలక నిర్ణయం 

'రాకింగ్ స్టార్' గా అశేష తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు మంచు మనోజ్(Manchu Manoj). 'మిరాయ్'(Mirai)తో తన రూటు మార్చుకొని ప్రతినాయకుడుగా కనపడ్డాడు. 'మహాభీర్ లామా' క్యారక్టర్ ని అద్భుతంగా పోషించి, పాన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసాడు. మనోజ్ కోసమే రిపీట్ ఆడియెన్స్ మిరాయ్ కి వెళ్తున్నారంటే తన నట విశ్వరూపం ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు.

నిన్న మనోజ్ హిందువుల ఆరాధ్యదైవమైన 'అయోధ్య శ్రీరాముడిని(Ayodhya Sriramudu)దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా అయోధ్య(Ayodhya)లో మనోజ్ మాట్లాడుతు 'అయోధ్య రావడం సంతోషంగా ఉంది. ఇక్కడికి రావాలనేది కూడా నా కల. శ్రీరాముడు యుద్ధంలో గెలిచి ఇక్కడికి వచ్చాడు. మేము కూడా సినిమా యుద్ధంలో గెలిచి విజయం సాధించి వచ్చాం. దర్శనం అద్భుతంగా జరిగింది అమవాస్య రోజు దర్శనం మంచిదని స్వామిజీలు చెప్పారు. మరోసారి అయోధ్యకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వస్తాను. మీరంతా అయోధ్య శ్రీరాముడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాను. అయోధ్య నుంచే మిరాయ్ సక్సెస్ టూర్ ని ప్రారంభిస్తున్నామని మనోజ్ చెప్పాడు. ఆలయ ఆవరణలోనే ఉన్న హనుమాన్ గఢీని కూడా దర్శించి పూజలు చేసాడు.

'శ్రీరాముడు' ఆయుధమైన 'మిరాయ్' కి కళింగ యుగం నాటి 'అశోకుడు' శక్తులకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే పాయింట్ తోనే 'మిరాయ్' తెరకెక్కింది. కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni)దర్శకత్వం ప్రతిభ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media factory)నిర్మాణ విలువలు, తేజసజ్జ, రితిక నాయక్, శ్రీయ, జగపతి బాబు తమ నటనతో మిరాయ్ ని హిట్ దిశగా నడిపించారు. ఇక మనోజ్ కి పాన్ ఇండియా లెవల్లో పలు చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.