English | Telugu

ఆ విషయంలో ప్రభాస్‌ని మించినవారు లేరు.. మాళవిక ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఇతర హీరోల అభిమానులు కూడా ప్రభాస్‌ అంటే ఇష్టపడతారు. అంతేకాదు, అందర్నీ డార్లింగ్‌ అంటూ పలకరించే ప్రభాస్‌ అంటే ఇండస్ట్రీలోని వారందరికీ ఇష్టమే. ప్రభాస్‌తో సినిమాలు చేసిన దర్శకులైనా, తోటి నటీనటులైనా అతని గురించి చాలా గొప్పగా చెప్పడం మనం చూస్తుంటాం. ముఖ్యంగా హీరోయిన్లు డార్లింగ్‌ ఆతిథ్యానికి ఫిదా అయిపోతారు. శ్రద్ధా కపూర్‌, పూజా హెగ్డే, దీపికా పదుకొణె, శ్రుతి హాసన్‌, కృతిసనన్‌.. ఇలా ప్రభాస్‌తో కలిసి నటించిన హీరోయిన్లు అందరూ సందర్భం వచ్చినపుడు అతని ఆతిథ్యం గురించి చెబుతూ పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. ‘సలార్‌’ చిత్రంలో ప్రభాస్‌తో కలిసి నటించిన పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఆమధ్య ప్రభాస్‌ ఆతిథ్యానికి ఉక్కిరిబిక్కిరి అయిపోయానని చెప్పాడు.

తాజాగా ఆ లిస్ట్‌లో హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ కూడా చేరింది. ప్రభాస్‌ హీరోగా మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘రాజా సాబ్‌’ చిత్రంలో నటిస్తోంది మాళవిక. ఈమె నటించిన ‘తంగలాన్‌’ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాళవిక పాల్గొంది. ఈ సందర్భంగా రాజాసాబ్‌ గురించి మాట్లాడుతూ ‘ప్రభాస్‌ సర్‌తో కలిసి నటిస్తేనే చాలు అనిపించింది. అలాంటిది ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. మీ అందరిలాగే నేను కూడా రాజాసాబ్‌ కోసం ఎదురుచూస్తున్నాను. ఇక్కడ ప్రభాస్‌ సర్‌ గురించి ఓ విషయం చెప్పాలి. ఆయన నా కోసం ఫుడ్‌ పంపించారు. ఎంత టేస్టీగా ఉందంటే.. మాటల్లో చెప్పలేను. అమ్మ చేసిన ఫుడ్‌ తర్వాత మళ్ళీ నాకు అంతబాగా నచ్చిన ఫుడ్‌ ప్రభాస్‌ సర్‌ పంపించిందే. మా అమ్మ వండినట్టుగానే ఉంది. మంచి ఆతిథ్యం ఇవ్వాలంటే ప్రభాస్‌ సర్‌ తర్వాతే ఎవరైనా. ఈ విషయంలో ఆయన్ని మించినవారు లేరు. అంత మంచి ఫుడ్‌ పంపిన ప్రభాస్‌ సర్‌ థాంక్స్‌ చెబుతున్నాను’ అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.