English | Telugu

16 ఏళ్ల త‌రువాత మ‌హేష్ మ‌రో ప్ర‌య‌త్నం

1 నేనొక్క‌డినే, ఆగ‌డు.. ఇలా రెండు వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం శ్రీ‌మంతుడు. మిర్చి వంటి ఘ‌న విజ‌యం సాధించిన సినిమాతో ద‌ర్శ‌కుడుగా తొలి అడుగులు వేసిన కొర‌టాల శివ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా జులై 17న విడుద‌ల‌కు ముస్తాబ‌యింది. విశేష‌మేమిటంటే.. 16 ఏళ్ల త‌రువాత మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన ఓ సినిమా జులై నెల‌లో రావ‌డం మ‌ళ్లీ శ్రీ‌మంతుడు విష‌యంలోనే. అప్పుడెప్పుడో మ‌హేష్ హీరోగా ప‌రిచ‌య‌మైన రాజ‌కుమారుడు చిత్రం జులై నెల‌లో విడుద‌లైతే.. ఇప్పుడు మ‌ళ్లీ శ్రీ‌మంతుడు అదే నెల‌లో రాబోతోంది. రాజ‌కుమారుడు స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో.. శ్రీ‌మంతుడు కూడా అదే సెంటిమెంట్‌ని ఫాలో అయి హిట్ లిస్ట్‌లో చేరుతుందేమో చూడాలంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.