English | Telugu

మ‌హేష్ అల‌ర్ట్ అయ్యాడు

చిన్న‌దో, పెద్ద‌దో సినిమా అనేస‌రికి ప‌బ్లిసిటీ చాలా ముఖ్యం. మీడియాలో సినిమా పేరు ఎంత మార్మోగితే... అంత ప‌బ్లిసిటీ గిట్టిన‌ట్టు. ప‌బ్లిసిటీ వ‌ల్ల సినిమా రేంజు ఎంత‌లా మారుతుందో చెప్ప‌డానికి బాహుబ‌లి సినిమానే ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమాని ముందు నుంచీ అంత‌ర్జాతీయ సినిమా అన్న‌ట్టు మీడియా ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తోంది. దాంతో.. సినిమాకి ప్ల‌స్స‌య్యింది. భారీ వ‌సూళ్లు చేజిక్కించుకొంది. ఇప్పుడు ఆ ప‌బ్లిసిటీ మ‌హ‌త్తు.. మ‌హేష్‌బాబుకీ బాగా తెలిసొచ్చింది. త‌న శ్రీ‌మంతుడు సినిమా కూడా ఇలానే మీడియాలో నానాల‌ని నానా పాట్లూ ప‌డుతున్నాడు. మ‌హేష్ ఎప్పుడూ మీడియాకు వీలైనంత దూరంలో ఉంటాడు. సినిమా హిట్ట‌యితేనే గానీ ప్రెస్ మీట్ల‌కు రాడు, ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డు. కానీ... శ్రీ‌మంతుడు విష‌యంలో మాత్రం మ‌హేష్ ఎల‌ర్ట్ అయ్యాడు. రిలీజ్ ఇంకా 20 రోజులున్నా.. ఇప్పుడే మీడియాకు ఇంట‌ర్వ్యూల మీద ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు.

ఇంగ్లీష్ మీడియాలో వ‌రుస‌పెట్టి మ‌హేష్ ఇంట‌ర్వ్యూలు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి. ఈ సినిమాని భారీగా ప్ర‌మోట్ చేయాల‌ని ప్రొడ్యూస‌ర్ల‌కు కూడా మ‌హేష్ సూచించాడ‌ట‌. శ్రీ‌మంతుడు లాంటి సినిమాల‌కు భారీ ఓపెనింగ్స్ అత్య‌వ‌స‌రం. తొలి మూడు రోజుల్లో ఎంత దండుకొంటే అంత మంచిది. అందుకే.. ఈ సినిమాని భారీగా ప్ర‌మోట్ చేసి ఓపెనింగ్స్ రాబ‌ట్టుకోవాల‌నుకొంటున్నాడు మ‌హేష్‌. మ‌రి ఆ ప్లాన్ ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.