English | Telugu

మోడీ ప్ర‌భాస్‌ని వాడుకోంటారా?

మోడీ - ప్ర‌భాస్ ల క‌ల‌యిక సినీ వ‌ర్గాల్లోనే కాదు, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిని పెంచుతోంది. కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తావిస్తోంది. ప్ర‌భాస్ క‌లుసుకొంది సినిమా (సొంత‌) `ప‌బ్లిసిటీ` కోస‌మే అయినా... వీటి వెనుక రాజ‌కీయ ఎత్తుగ‌డ కూడా ఉంద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. తెలుగునాట బ‌లం పుంజుకోవ‌డానికి బీజేపీ గ‌త ఎన్నిక‌ల నుంచీ గట్టి ప్ర‌ణాళిక‌లు వేసుకొంది. తెలుగునాట తిరుగులేని స్టార్ గా వెలుగొంతుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ చేత జై మోడీ అనిపించారు. ఇప్పుడు వ‌వ‌న్ ఇటు తెదేపాకి, అటు బీజేపీకి స‌లాం కొట్టేసే స్థితికి వ‌చ్చేశాడు. ఈ ద‌శ‌లో బీజేపీకి సినీ గ్లామ‌ర్ అత్య‌వ‌స‌రం. అందుకే.. వాళ్ల ప్లాన్‌లు వాళ్ల‌కున్నాయి.

ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజు బీజేపీ హ‌యాంలో కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు ఆ పార్టీపై ఇప్ప‌టికీ న‌మ్మ‌కం ఉంది. అటు బీజేపీ కూడా కృష్ణంరాజుని వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ప్ర‌బాస్ పాపులారిటీ కూడా వాళ్ల‌ను ఆకర్షిస్తోంది. బాహుబ‌లితో తెలుగునాటే కాదు, బాలీవుడ్‌లోనూ ప్ర‌భాస్ ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఈ ద‌శ‌లో ప్ర‌భాస్‌ని మ‌చ్చిక చేసుకోవ‌డం బీజేపీకి క‌లిసొచ్చే అంశ‌మే. ఇప్పుడు కాక‌పోయినా... అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భాస్‌ని వాడుకోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.

పెద‌నాన్న కోసం ప్ర‌భాస్ కూడా బీజేపీకి మ‌ద్ద‌తుగా త‌న గ‌ళం వినిపించే అక‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌వ‌న్ జ‌న‌సేన త‌ర‌పున త‌న బ‌ల‌గాన్ని ఎన్నిక‌ల బ‌రిలో దింపే ఛాన్సుంది. అందుకే ప్ర‌భాస్‌ని అడ్డం పెట్టుకొని తెలుగునాట కావ‌ల్సినంత ప్ర‌చారం చేసుకోవాల‌ని మోడీ అండ్ కో ఆలోచిస్తోంది. మ‌రి ఇవన్నీ జ‌రుగుతాయా? ఈసారి ప్ర‌భాస్‌ని మోడీ ఎంత వ‌ర‌కూ వాడుకొంటాడు? మోడీకి ప్ర‌భాస్ ఎంత వ‌ర‌కూ స‌హాయ‌ప‌డ‌తాడు? చూడాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల సీజ‌న్ వ‌రకూ ఆగాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.