English | Telugu

'ఆగడు' కోసం అజ్మీర్ దర్గాకి మహేష్

తన సినిమాల విడుదల ముందు అజ్మీర్ దర్గాను దర్శించుకోవడం హీరో మహేష్ బాబు కి ఈమధ్య సెంటిమెంటుగా మారింది. గతంలో 'దూకుడు' సినిమా హిట్టయ్యాక ఓసారి వెళ్ళాడు. తర్వాత 'బిజినెస్ మేన్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాల విడుదల సమయంలో కూడా ప్రత్యేకంగా వెళ్లి అజ్మీర్ దర్గాను దర్శించుకున్నాడు. అప్పటి నుంచే అతనికి ఇది సెంటిమెంట్ అయిందనే చెప్పచ్చు. లేటెస్ట్ గా తను నటించిన 'ఆగడు' చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగానే మహేష్ అజ్మీర్ దర్గాని సందర్శించి ప్రత్యేక పార్థనలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ‘ఆగడు’ విజయం సాధించాలని ఆయన ప్రార్థించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఆగడు మూవీలో తమన్నా ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రిన్స్‌తో మిల్క్ బ్యూటీ జతకట్టడం ఇదే మొదటిసారి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.