English | Telugu

ఈ సంక్రాంతికి 'సూప‌ర్‌' వార్‌

మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలుగు చిత్ర‌సీమ‌కు రారాజులుగా వెలిగిపోతున్నారు. పారితోషికం విష‌యంలోనూ, క్రేజ్ విష‌యంలోనూ, అభిమానగ‌ణం విష‌యంలోనూ ఎవ్వ‌రికీ ఎవ్వ‌రూ తీసిపోరు. వీరి సినిమాలు విడుద‌ల అవుతున్నాయంటే బాక్సాఫీసుకు పండ‌గే. అలాంటిది మ‌హేష్, ప‌వ‌న్ ఇద్ద‌రూ ఒకేసారి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఢీ కొట్టుకొంటే ఎలా ఉంటుంది...? పండ‌గ‌ల‌న్నీ ఫ్యామిలీ ప్యాక్ ఆఫ‌ర్‌లా వ‌చ్చేసినంత సంబ‌రంగా ఉంటుంది. ఈ క‌ల త్వ‌ర‌లోనే నిజం కాబోతోంది. మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వం, ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ 2 ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. మ‌హేష్ - శ్రీ‌కాంత్ అడ్డాల కాంబినేష‌న్లో బ్ర‌హ్మోత్స‌వం ప‌ట్టాలెక్కేసింది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. మ‌రోవైపు గ‌బ్బ‌ర్ సింగ్ 2 కూడా స్టార్ట‌య్యింది. దీనికీ ముహూర్తం ఫిక్స‌య్యింది. ఈసినిమానీ సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని ప‌వ‌న్ ఫిక్స‌య్యాడ‌ట‌. అంటే 2016 సంక్రాంతి.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఇద్ద‌రు స్టార్ల సూప‌ర్ వార్ చూసేయొచ్చ‌న్న‌మాట‌. మ‌హేష్‌కి సంక్రాంతి సీజ‌న్ బాగానే క‌లిసొచ్చింది. ప‌వ‌న్ కూడా ఈ యేడాది సంక్రాంతికే గోపాల గోపాల హిట్ ఇచ్చాడు. మ‌రి వీరిద్ద‌రూ ఢీ కొట్టుకొనే 2016 పండ‌క్కి విజేత‌గా నిల‌బ‌డేది ఎవ‌రో..?? నిర్ణ‌యించాల్సింది తెలుగు ప్రేక్ష‌కులే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.