English | Telugu

ప్రిన్స్ సరసన మరోసారి సమంత

ప్రిన్స్ సరసన మరోసారి సమంత హీరోయిన్ గా నటించబోతూందని తెలిసింది. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు హీరోలుగా, "కొత్తబంగారు లోకం" ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". ఈ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంలో హీరో వెంకటేష్ అన్నయ్యగా, మహేష్ బాబు ఆయన తమ్ముడిగా నటిస్తున్నారు. వెంకటేష్ సరసన "జర్నీ" ఫేం అంజలి హీరోయిన్ గా నటిస్తూంటే, మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా నటిస్తూంది.

మిక్కీ.జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్టణంలో జరుగుతూంది. అక్కడ రామకృష్ణా బీచ్, ఆంధ్రా యూనివర్సిటీ తదితర పరిసర ప్రాంతాల్లో ఈ"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"చిత్రం షూటింగ్ జరుగుతూంది. ఫిబ్రవరి 9 నుండి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం షూటింగ్ లో ప్రిన్స్ మహేష్ బాబు కూడా పాల్గొంటారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.