English | Telugu

రవితేజ "నిప్పు" ఫిబ్రవరి 17 న రిలీజ్

రవితేజ "నిప్పు" ఫిబ్రవరి 17 న రిలీజ్ కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే బొమ్మరిల్లు వారి పతాకంపై, శ్రీమతి యలమంచిలి గీత సమర్పణలో, మాస్ మహరాజా రవితేజ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, గుణశేఖర్ దర్శకత్వంలో, ప్రముఖ దర్శక, నిర్మాత వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం" నిప్పు". తమన్ సంగీతం అందించిన ఈ "నిప్పు" చిత్రం ఆడియో ఇటీవలే ఘనంగా విడుదలయ్యింది.

ఈ "నిప్పు" చిత్రం ముందుగా అనుకున్నదాని ప్రకారం సంక్రాంతి పండుగకు విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆలస్యమై ఈ "నిప్పు" చిత్రం ఫిబ్రవరి రెండవ తేదీన విడుదలవుతుందని అన్నారు. కానీ ప్రస్తుతం అది కూడా కాకుండా ఈ "నిప్పు" చిత్రం ఫిబ్రవరి 17 వ తేదీన విడుదలవుతుందని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.