English | Telugu

నాగ్ సరసన మళ్ళీ నయనతార

నాగ్ సరసన మళ్ళీ నయనతార హీరోయిన్ గా నటించబోతూందని తెలిసింది. వివరాల్లోకి వెళితే గతంలో కింగ్ నాగార్జున సరసన "బాస్" చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. తర్వాత అదే నిర్మాత అంటే కామాక్షీ కళా మూవీస్ అధినేత డి.శివప్రాసాదరెడ్డి నిర్మించబోతున్న చిత్రంలో కూడా నాగార్జున సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తూందని సమాచారం. ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహించనున్నారు. మార్చి నుండి ఈ చిత్రం ప్రారంభమవుతుంది.

గతంలో నాగార్జున హీరోగా నటించిన "సంతోషం" చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహించారు. యువరత్న నందమూరి బాలకృష్ణ సరసన "శ్రీరామరాజ్యం" చిత్రంలో నటించిన నయనతార ఇక సినిమాల్లో నటించదని అందరూ అనుకుంటున్న సమయంలో నాగార్జున హీరోగా నటించబోయే ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించటం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.