English | Telugu

మ‌హేష్ ట్రాక్ త‌ప్పుతున్నాడా?

ఆగ‌డు ఫ్లాప్ నుంచి ఇంకా కోలుకోలేదు... మ‌హేష్ ఫ్యాన్స్‌. ఇప్పుడు వాళ్లంద‌రికీ మ‌రో షాక్ త‌గిలింది. అదీ.... వి.వి.వినాయ‌క్ రూపంలో. మ‌హేష్‌బాబు -వివివినాయ‌క్ కాంబినేష‌న్ అన‌గానే అంద‌రికంటే ఎక్కువ‌గా షాక్ తిన్నది మ‌హేష్ ఫ్యాన్సే. అస‌లు ఈ కాంబినేష‌న్ సెట్ అవుతుందా?? ఇద్దరికీ కెమిస్ట్రీ కుదురుతుందా? అనేది బిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా మారింది. వినాయ‌క్‌ది ఫుల్‌లెంగ్త్ యాక్షన్ మూడ్‌. ఆయ‌న సినిమాల్లో హీరో.. మాస్‌కి నిలువెత్తు క‌టౌట్‌లా ఉంటాడు. మ‌హేష్ కూడా మాస్ పాత్రలు చేశాడు గానీ, మ‌రీ అంత మాసీ ఫేస్ కాదు. శ్రీ‌నువైట్ల, పూరి, త్రివిక్రమ్ శైలిల‌కు మ‌హేష్ అతికిన‌ట్టు స‌రిపోతాడు. కానీ వినాయ‌క్ ఫ్రేమ్‌లో మ‌హేష్‌ని ఊహించ‌డం చాలా క‌ష్టం. అలాంట‌ప్పుడు మ‌హేష్ వినాయ‌క్‌ని ఎలా ఎంచుకొన్నాడో ఎవ్వరికీ అర్థం కావ‌డంలేదు. `1` సినిమాతో ప్రయోగాలు చేయ‌డ‌కూడ‌ద‌నే పాఠం నేర్చుకొన్న మ‌హేష్‌..... ఆ టైపు క‌థ‌ల్ని పూర్తిగా ప‌క్కన పెట్టేశాడు.

అయితే తాను న‌మ్ముకొన్న క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఆగ‌డు సినిమాని కాపాడ‌లేక‌పోయాయి. అందుకే మ‌హేష్‌లో ఇప్పుడు కొత్త క‌న్‌ఫ్యూజ‌న్ మొద‌లైంది. ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలో, ఏ దారిలో న‌డ‌వాలో తెలియ‌క మ‌హేష్ చాలా ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని, ఈ క‌న్‌ఫ్యూజ‌న్‌లోనే వినాయ‌క్ క‌థ‌కీ ఒకే చెప్పేసుంటాడ‌ని టాక్‌. క‌థ‌ల్ని, పాత్రల్ని కాకుండా ద‌ర్శకుడికి ఉన్న స్టార్ వాల్యూని మ‌హేష్ న‌మ్ముతున్నాడా అనే అనుమానం వేస్తోంది. అస‌లు మ‌హేష్ మ‌న‌సులో ఏముందో, త‌న‌కే తెలియాలి. నిజానికి మ‌హేష్ - వినాయ‌క్‌ల కాంబినేష‌న్ సెట్టవుతుంద‌న్న న‌మ్మకాలూ ఎవ్వరికీ లేవు. ఎందుకంటే మ‌హేష్ కొర‌టాల శివ సినిమా పూర్తి చేయాలి. ఆ త‌ర‌వాత పూరి, త్రివిక్రమ్‌ల సినిమాలు మొద‌లువుతాయి. మ‌రోవైపు లింగుస్వామి కూడా మ‌హేష్ కోసం క్యూలో ఉన్నాడు. వీళ్లంద‌రి సినిమాలూ పూర్తి చేసేట‌ప్పటికి ఎన్నేళ్లు ప‌డుతుందో? అప్పటికి ఎన్ని లెక్కలు మార‌తాయో...? అందుకే వినాయ‌క్ సినిమా ఉండే ఛాన్స్ లేద‌ని, ఇది ఉత్తుత్తి కాంబినేష‌న్ అని కొంత‌మంది మ‌హేష్ ఫ్యాన్సే వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి వారి మాటే నిజ‌మ‌వుతుందంటారా??

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.