English | Telugu

ఒక్క పోస్ట్‌తో నెగెటివ్‌ ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది!

తమిళ టి.వి. నిర్మాత రవీందర్‌, మహాలక్ష్మీ ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, వీరి వివాహం దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసిన విసయం తెలిసిందే. వీరు పెళ్ళి చేసుకొని నెటిజన్ల ట్రోలింగ్‌కి గురయ్యారు. ఆ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని వారు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా తనను మోసం చేశాడంటూ ఓ వ్యక్తి రవీందర్‌పై చీటింగ్‌ కేసు పెట్టాడు. ప్రస్తుతం రవీందర్‌ జైలులో ఉన్నాడు. ఈ సమయంలో రవీందర్‌పై మహాలక్ష్మీ కొన్ని ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తనను మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడని, ఈ చీటింగ్‌ కేసు గురించి తనతో చెప్పలేదని... ఇలా రకరకాల విమర్శలు చేసిందని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. కొందరు మహాలక్ష్మీపై సింపతీ చూపిస్తే, మరికొందరు భర్త జైలులో ఉంటే భార్య ఇలా మాట్లాడడం తగదు అంటూ విమర్శించారు. ఇవి కాక ఇంకా రకరకాలుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వీటన్నింటికీ మహాలక్ష్మీ ఒక్క పోస్ట్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టింది. దాని సారాంశం ఇది.. ‘నా పెదవులపై చిరునవ్వు తెప్పించే విషయంలో నువ్వు ఎప్పుడూ విఫలం కాలేదు. ప్రేమకు నమ్మకమే ప్రధానం. నాకంటే నమ్మకమే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తోంది. ఎప్పటిలాగే ప్రేమను చూపించు. ముందుకంటే ఎక్కువగా ప్రొటెక్ట్‌ చేయ్‌’. ఈ పోస్టు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చేందుకే పెట్టిందని అర్థమవుతోంది. ఇప్పుడీ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.