English | Telugu

మా ఊరి పొలిమేర 2 ఫస్ట్ లుక్ పోస్టర్

‘మా ఊరి పొలిమేర‌’ మూవీ సైలెంట్ గా వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. ఇందులో స‌త్యం రాజేష్‌, బాలాదిత్య‌, ర‌వి వ‌ర్మ‌, కామాక్షి భాస్క‌ర్ల‌, గెట‌ప్ శీను, చిత్రం శ్రీను ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఆడియెన్స్‌ను అల‌రించింది. ఇక ఈ మూవీ సీక్వెల్ ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఖ‌మ్మం, హైద‌రాబాద్ ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. ఈ సీక్వెల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని గెటప్ శీను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు.

" మోస్ట్ ఎవైటెడ్ స్ట్రైకింగ్ & స్కింటిలేటింగ్ మా ఊరి పొలిమెర సీక్వెల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదిగో ... థియేటర్స్ లో త్వరలో మీ కోసం రాబోతోంది" అని పోస్ట్ చేసుకున్నాడు. ఈ మూవీ సీక్వెల్ కూడా ఫస్ట్ పార్ట్ లా ఆడియన్స్ ని ఆక‌ట్టుకుంటుంద‌ని... ఎవరూ ఊహించ‌లేని ట్విస్టులు, మలుపులు ఉన్నాయని చెప్పారు ప్రొడ్యూసర్స్. ఈమధ్య బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించి ఎన్నో రకాల మూవీస్ వస్తున్నాయి. గూస్ బంప్స్ తెప్పించే మూవీస్ నే చూడడానికి ఇష్టపడుతున్నారు ఆడియన్స్ కూడా. సత్యం రాజేష్ కి చేతబడులు, మంత్ర విద్యలు వచ్చు అనే విషయాన్ని ఫస్ట్ పార్టులో రివీల్ చేశారు. కానీ ఇప్పుడు సెకండ్ పార్టులో ఏ అంశం గురించి చెప్పబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ పార్ట్ లో బాలాదిత్య చాలా కూల్‌గా సైలెంట్ గా ఎవరేమన్నా ఎక్కడ బోర్డర్ తప్పకుండా తన పని తాను చేసుకుంటూ కనిపించాడు. మరి ఈ సెకండ్ పార్ట్ లో బాలాదిత్య ఎలా కనిపించబోతున్నాడు...వంటి విషయాలు తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.