English | Telugu

లయన్ గర్జిస్తుందా?

నందమూరి అభిమానులు సంబరాల్లో ఉన్నారు. సూపర్ డూపర్ హిట్టైన సింహా, చరిత్ర తిరగరాసిన లెజెండ్ తర్వాత.... వస్తోన్న సినిమా కావడంతో లయన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కేవలం అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ లయన్ పై భారీ అంచనాలున్నాయి.

నందమూరి నటసింహంగా పిలుచుకునే బాలయ్యబాబుకు సింహం సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది. తన టైటిల్ లో సింహం ఉంటే బాక్సాఫీస్ వద్ద గర్జిస్తాననే నమ్మకం. ఇది నిజమే అన్నట్టు గతంలో వచ్చిన బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా ఇలా అన్నీ ఆ కోవకు చెందినవే. దీంతో కాస్త రూట్ మార్చి తెలుగు సింహాన్ని లయన్ గా మార్చేశాడన్నమాట.

బాలయ్యకు మరో కలిసొచ్చే అంశం మణిశర్మ. నందమూరి హీరో కెరీర్లో మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన దాదాపు అన్ని ఆడియోలు హిట్టవడంతో పాటూ సినిమాలు కూడా ఘనవిజయాన్నందుకున్నాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు పాటలు ఇప్పటికీ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తున్న లయన్ ఆడియోకి కూడా మంచి స్పందనే వచ్చింది.

బాలకృష్ణ డబుల్ రోల్ కూడా ఈ మధ్య కాసుల వర్షం కురిపిస్తోందనే డిస్కషన్ జోరందుకుంది. సింహా, లెజెండ్ ఈ రెండింటిలోనూ ద్విపాత్రాభినయం చేసి దుమ్ములేపాడు. లేటెస్ట్ మూవీ లయన్ లోనూ ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. మరి ఈ మాటల్లో ఎంతవరకూ నిజముందో తెలీదు కానీ ప్రస్తుతం బాలయ్యకు డబుల్ రోల్ కలిసొచ్చే అంశమే.

పైవన్నీ ఒకెత్తైతే.....హీరోయన్ సెంటిమెంట్ మరొఎత్తు. లయన్ కు హీరోయిన్ దొరకలేదో...లేదా కావాలనే రాధికా ఆప్టేను రిపీట్ చేస్తున్నారో తెలీదు కానీ... అమ్మడు నటసింహానికి కలిసొస్తుందని అంటున్నారంతా. రెండువారాలు సినిమా థియోటర్లో ఉండడం కష్టమైన ఈ రోజుల్లో ఎమ్మిగనూరు థియోటర్లో 365 రోజులు ఆడి సంచలనం సృష్టించింది లెజెండ్. అందుకే మళ్లీ రాధికపైనే బాలయ్య మనసుపడ్డాడట.

అయితే అబ్బాయ్ హీరోయిన్స్ (త్రిష) బాబాయ్ కి కలసిరారని, కొత్త దర్శకుడు కిక్ ఇవ్వడనే నెగిటివ్ సెంటిమెంట్స్ ఉన్నా....నందమూరి ఫ్యాన్స్ మాత్రం లయన్ భారీ విజయం అందుకుంటుందని అని ఫిక్సైపోయారు. మరి... చరిత్ర సృష్టించాలన్నా మేమే...దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్న బాలకృష్ణ...లెజండ్ రికార్డ్ ని తిరగరాస్తాడేమో కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.