English | Telugu

పిల్ల‌ల‌తో ఆడుకున్న కృతిస‌న‌న్‌!


రోమ్‌లో ఉంటే రోమ‌న్‌లా ఉండ‌మ‌న్నారు. ఈ సామెత‌ను కృతిస‌న‌న్ చాలా అద్భుతంగా నేర్చుకున్నారు. ఎంత ఇంట్ర‌స్టింగ్‌గా నేర్చుకున్నారో, అంత‌కు రెట్టింపు శ్ర‌ద్ధ‌గా పాటిస్తున్నారు. ఆమె పార్టీల‌కు వెళ్తే డ్ర‌స్సింగ్ స్టైల్‌ని బీట్ చేసేవాళ్లుండ‌రు. షూటింగుల‌కు వెళ్తే సిన్సియారిటీకి ఫిదా కాని వారు ఉండ‌రు. కేర‌క్ట‌ర్ల‌ను సెల‌క్ట్ చేసుకుంటే క్లాప్స్ కొట్ట‌నివారే ఉండ‌రు. అందుకే కృతిస‌న‌న్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రేంజ్‌లో ఉంటుంది.రీసెంట్‌గా ఈమె చేసిన ఓ ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో నాన్‌స్టాప్‌గా వైర‌ల్ అవుతోంది. కృతి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుష్ చేస్తోంది. ఇటీవ‌ల ఆమె ఎక‌నామీ క్లాస్‌లో విమానంలో ట్రావెల్‌చేశారు. తెల్ల‌టి డ్ర‌స్‌లో పింక్ షాల్‌లో ఉన్నారు కృతిస‌న‌న్‌. బ్లాక్ మాస్క్ పెట్టుకున్నారు. ఆమె ప్లెయిన్‌లో ఉండ‌టం చూసి సేమ్ ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తున్న ఓ చిన్నారి ఆమెను ప‌ల‌క‌రించింది. అంతే, చిన్నారిని చూసిన కృతిస‌న‌న్ కూడా చిన్న‌పిల్ల‌గా మారిపోయారు. చిన్నారి చేతులు ప‌ట్టుకుని తెగ ఆడించారు. ఫ్లైయింగ్ కిస్సులు ఇవ్వ‌డం, ఆడుకోవ‌డం అంద‌రినీ అట్రాక్ట్ చేసింది.

మామూలు ఆడియ‌న్స్ ఫిదా అయితే ఫ‌ర్వాలేదు, కృతి చేష్ట‌లు చూసి స‌హ సెల‌బ్రిటీలు కూడా మురిసిపోతున్నారు. ఆమెక‌న్నా ముందు దీపిక ప‌దుకోన్‌, కార్తిక్ ఆర్య‌న్‌, ఆమిర్ ఖాన్ కూడా ఎక‌నామి క్లాస్‌లో ట్రావెల్ చేసిన‌ప్పుడు కో ప్యాసింజ‌ర్స్ తో స‌ర‌దాగా ఉన్న సంద‌ర్భాల‌ను గుర్తుచేసుకుంటున్నారుఅన్న‌ట్టు ఆమె ఆదిపురుష్‌లో జాన‌కి కేర‌క్ట‌ర్‌లో న‌టించారు. ఆ సినిమా క‌బుర్లు కూడా కో ప్యాసెంజ‌ర్స్ తో చెప్పారా? అని కొంద‌రు నెటిజ‌న్లు స‌ర‌దాగా అడుగుతున్నారు. ఈ చిత్రంతో పాటు కృతిస‌న‌న్ కిట్టీలో మ‌రికొన్ని సినిమాలున్నాయి. ట‌బు, క‌రీనాక‌పూర్‌తో క‌లిసి ది క్రూలో న‌టిస్తున్నారు కృతి. షాహిద్ క‌పూర్‌తో మ‌రో సినిమాలోనూ న‌టిస్తున్నారు ఈ బ్యూటీ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.