English | Telugu

హరిహర వీరమల్లుపై క్రిష్ కీలక వ్యాఖ్యలు

విభిన్న జోనర్స్ కి చెందిన సినిమాలని తెరకెక్కించడంలో దర్శకుడు 'క్రిష్ జాగర్లమూడి'(krish Jagarlamudi)ముందు వరుసలో ఉంటాడు. గమ్యం, కంచె, వేదం, గౌతమీపుత్రశాతకర్ని,ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, మణికర్ణిక వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం 'అనుష్క' తో 'ఘాటీ' అనే మరో విభిన్నమైన కథాంశంతో కూడిన చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో 'ఘాటీ' పై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ నెల 24 న రిలీజ్ కాబోతున్న 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)కి మొదట క్రిష్ నే దర్శకుడు. చాలా భాగాన్ని కూడా తెరకెక్కించాడు. ఆ తర్వాత 'జ్యోతికృష్ణ' దర్శకుడుగా వ్యవహరించడం జరిగింది. రీసెంట్ క్రిష్ 'ఎక్స్' వేదికగా ఇప్పుడు 'హరిహరవీరమల్లు' ప్రపంచంలోకి నిశ్శబ్దంగా కాకుండా ఒక పర్పస్ తో అడుగుపెడుతున్నాడు. ప్రతి ఫ్రేమ్ వెనుక చరిత్ర యొక్క బరువు ఫ్యాషన్ నిండి ఉంది. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా సాధ్యమైంది, ఇది సినిమా కాదు ఆత్మ. మన పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప దాని ద్వారా ఆశీర్వదించబడిన అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరా పూర్తిగా సంగ్రహించలేని ఒక అగ్ని ఉంది. ఆయన నిత్యం మండే స్ఫూర్తి. అదే వీరమల్లుకి ప్రాణం పోసింది. పవన్ గారే వీరమల్లు కి వెన్నెముక, ఆత్మ మరియు తుఫాను.

నిర్మాత ఎఎం రత్నం(Am Rathnam)గారు, భారతీయ సినిమా యొక్క కొన్ని గొప్ప అనుభవాల వెనుక ఉన్న పెద్ద ఆర్కిటెక్ట్. ఆయన అచంచలమైన బలం వల్లనే వీరమల్లు నిర్మాణం జరుపుకుంది. ఈ సినిమా నా అత్యంత ఉత్సాహభరితమైన యుద్ధాలలో ఒకటి. దర్శకుడిగా మాత్రమే కాదు, మరచిపోయిన చరిత్రను అన్వేషించే వ్యక్తిగా, అసౌకర్య సత్యాలను అన్వేషించే వ్యక్తిగా, అన్నింటికంటే ముఖ్యంగా జ్ఞానోదయం కలిగించే సినిమాని నమ్మే వ్యక్తిగా వీరమల్లు ఎంతో ప్రత్యేకమైనది. మూవీ తప్పకుండా విజయాన్ని సాధిస్తుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరమల్లు కి సంబంధించి 'క్రిష్' కృషి ఎంతగానో ఉందని అభినందించిన విషయం తెలిసిందే.


రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.