English | Telugu

డైరెక్టర్ గా మారిన 30 ఇయర్స్ పృథ్వీ.. 'కొత్త రంగుల ప్రపంచం' టీజర్ విడుదల!

కమెడియన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.. డైరెక్టర్ గా మారాడు. తన కూతుర్ని హీరోయిన్ గా పెట్టి 'కొత్త రంగుల ప్రపంచం' అనే సినిమా చేసాడు. క్రాంతి హీరోగా నటిస్తుండగా పృథ్వీ కూతురు శ్రీలును హీరోయిన్ గా పరిచయం చేస్తూ శ్రీ పిఆర్ క్రియేషన్స్ బ్యానర్‌‌పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి కలిసి నిర్మించిన చిత్రం 'కొత్త రంగుల ప్రపంచం'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా నటుడు నాగబాబు 'కొత్త రంగుల ప్రపంచం' టీజర్ ను విడుదల చేశారు.

టీజర్ విడుదల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన నటుడు సుమన్ మాట్లాడుతూ.. "కొత్త రంగుల ప్రపంచం టీజర్ చూస్తుంటే చాలా ప్రామిసింగ్ గా ఉంది. నటుడు పృథ్వీ మంచి కథను సెలెక్ట్ చేసుకొని దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో, హీరోయిన్ లు కొత్తవారైనా చాలా బాగా నటించారు. కొత్త వారు అని చూడకుండా కథను నమ్మి తీసిన ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి "అన్నారు.

నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. "నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు నిర్మాతలు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే హీరోగా పరిచయం అవుతున్న క్రాంతి చాలా బాగా నటించాడు. మరియు హీరోయిన్ గా పరిచయం అవుతున్న మా అమ్మాయి శ్రీలు కూడా ఈ సినిమా కోసం ఒక సంవత్సరం పాటు లిక్విడ్ డైట్ చేసి ఆ తరువాత హీరోయిన్ గా పర్ఫెక్ట్ అన్న తరువాతే నటించింది. ఈ సినిమాలో తన నటనను చూసిన సెన్సార్ వారు సైతం మీ అమ్మాయిలో మరో విజయశాంతి ను చూశాము, చాలా బాగా నటించింది అని మెచ్చుకున్నారు. ఈ సినిమా ద్వారా వస్తున్న వీరిద్దరినీ ప్రేక్షకులకు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకు శివారెడ్డి చక్కటి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే ఆదిత్య అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇందులో నటించిన నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. మా సినిమా చూసిన వారు అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.

హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ.. "మా నాన్న దర్శకత్వంలో హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నన్ను మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

హీరో క్రాంతి మాట్లాడుతూ.. "ఇలాంటి మంచి కథలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదములు" అన్నారు.

చిత్ర నిర్మాతలు పద్మ రేఖ,గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి లు మాట్లాడుతూ.. "పృథ్వీ గారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాము. మా సినిమా ద్వారా పృథ్వీ గారి కూతురు హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన వారంతా ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన మా కొత్త రంగుల ప్రపంచం సినిమా టీజర్ ను విడుదల చేసిన నాగబాబు కు ధన్యవాదాలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది" అన్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.